ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డెహ్రాడూన్ జిల్లాలోని వికాస్నగర్ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
ఈ ప్రమాదం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ జిల్లాలోని 170 కిలో మీటర్ల దూరంలో ఉన్న చక్రతా తహసీల్లోని టీయూని అనే మారుమూల ప్రాంతంలో చోటుచేసుకుంది. బుల్హాద్-బైలా రోడ్డు గుండా వికాస్నగర్ వెళ్తున్న క్రమంలో యుటిలిటీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో మృతదేహాలన్నీ చెల్లచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 16 మంది ఉన్నట్టుగా సమాచారం. దీంతో మృతదేహాలన్నీ చెల్లచెదురుగా పడ్డాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్థులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఈ ఘటన ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.