telugu navyamedia
క్రైమ్ వార్తలు

సికింద్రాబాద్‌ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం

హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. సికింద్రాబాద్‌లోని బోయిగూడలో స్క్రాప్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డిపోలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో టింబర్‌ డిపోలో మొత్తం 12 మంది కార్మికులున్నట్లు డిపో యాజమాన్యం తెలిపింది. ఆ తర్వాత ప్లాస్టిక్ గోడౌన్ కు కూడా మంటలు వ్యాపించాయి.

కొందరు సజీవదహనం కాగా పొగతో ఊపిరాడక మరికొందరు మృతి చెందినట్లు వెల్లడించింది. . మృతులంతా బిహార్​కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న వెంట‌నే ఆగ్నిమాప‌క సిబ్బంది మొత్తం 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.  ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లు తెలుస్తోంది

బోయిగూడ ఐడీహెచ్ కాలనీలోని టింబర్ స్క్రాప్ గోడౌన్‌లో మంగళవారం రాత్రి 15 మంది అందులో పని చేసే కార్మికులు నిద్ర పోయారు. వేకువజామున షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు ఎగసిపడిన‌ట్లు అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు.

Related posts