దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను 10రోజుల పోలీసుల కస్టడీకి షాద్నగర కోర్టు అప్పగించింది. ఈ కేసులో నిందితులను లోతైన విచారణ చేయాలని షాద్ నగర్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన కోర్టు.. వారిని పోలీసులకు కస్టడీకి అప్పగించింది. విచారణలో భాగంగా దిశా మొబైల్ ఫోన్ను, నిందితుల వాంగ్మూలంను రికార్డు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి వెల్లడించారు. దీంతో నిందితులను 10 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగించింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను షాద్ నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆ మానవ మృగాలను చంపేయాలంటూ చర్లపల్లి జైలు వద్ద మూడు రోజులుగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ నిందితులను షాద్ నగర్ కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు పరిసరాల్లోనూ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.