telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్​తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్​ భేటీ..

ముఖ్యమంత్రి కేసీఆర్​తో ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ భేటీ అయ్యారు. తన తల్లి వైద్యం కోసం హేమంత్ సోరెన్ కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సంద‌ర్భంగా సాయంత్రం తెలంగాణ‌ ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​తో సమావేశమయ్యారు.

జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా ఇతర అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎన్డీయేతర పార్టీలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే .

ఇటీవల రాంచీ వెళ్లిన సీఎం కేసీఆర్… గాల్వాన్ లోయలో మరణించిన ఝార్ఖండ్​కు చెందిన సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించారు. దేశ పరిస్థితులు, రాజకీయాలు సహా ఇతర అంశాలపై చర్చించారు. తాజాగా మరోమారు ఇరువురు ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా భేటీ అయ్యారు.

Related posts