రాయలసీమ అభివృద్ధి అయితేనే రాష్ట్రాభివృద్ధి చెందినట్లు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం పుట్టపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో ఆయన మాట్లాడుతూ నదుల అనుసంధానంతో అనంతపురం చరిత్ర మారుస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ ఇచ్చామని తెలిపారు. ఏప్రిల్ 4న డ్వాక్రా మహిళలకు మరో రూ.4వేలు అందిస్తామని వెల్లడించారు.
అలాగే పెన్షన్లను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు. చంద్రన్న బీమాతో కార్యకర్తలను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులకు రూ.24,500 కోట్లు రుణమాఫీ చేసినట్లు గుర్తుచేశారు. అన్ని చెరువులకు నీళ్లిచ్చే బాధ్యత తనదేనన్నారు. జగన్కు నేరచరిత్ర తప్ప మరొకటి లేదని దుయ్యబట్టారు. పట్టిసీమ, హంద్రీనీవా, పోలవరానికి జగన్ అడ్డుపడ్డారని చంద్రబాబు ఆరోపించారు.