యడ్యూరప్ప మనమరాలు సౌందర్య వసంత నగరలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మనుమరాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.అయితే.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. యడ్యూరప్ప కుమార్తె పద్మావతి కూతురు సౌందర్య. డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సౌందర్య 2018లో డా. నీరజ్ను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప ఉంది…
ఈ ఘటన బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోస్ట్మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆత్మహత్యకు కారణాలు ఏంటి అనే అంశంపై ఆరా తీస్తున్నారు.
గత కొంత కాలంగా ఆమె కుటుంబ కలహాలతో డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.