telugu navyamedia
క్రైమ్ వార్తలు

యడ్యూరప్ప కుటుంబంలో విషాదం!

యడ్యూరప్ప మనమరాలు సౌందర్య వసంత నగరలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

కర్నాటక మాజీ సీఎం​ యడ్యూరప్ప కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మనుమరాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.అయితే.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. యడ్యూరప్ప కుమార్తె పద్మావతి కూతురు సౌందర్య. డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సౌందర్య 2018లో డా. నీరజ్​ను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప ఉంది…

ఈ ఘటన బెంగళూరులోని హైగ్రౌండ్స్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. పోస్ట్​మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని బౌరింగ్​ ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆత్మహత్యకు కారణాలు ఏంటి అనే అంశంపై ఆరా తీస్తున్నారు.

గత కొంత కాలంగా ఆమె కుటుంబ కలహాలతో డిప్రెషన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts