telugu navyamedia
సినిమా వార్తలు

మరోసారి తండ్రైన దిల్​రాజు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

కరోనా సమయంలో, రెండేళ్ల క్రితం… డిసెంబర్ 10, 2020లో ‘దిల్’ రాజు, తేజస్విని వివాహం జరిగింది. నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక నిర్వహించారు.

‘దిల్’ రాజుకు తేజస్విని వ్యాఘా రెడ్డి రెండో భార్య. మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో 2017లో కన్నుమూశారు.. ‘దిల్’ రాజు, అనిత దంపతులకు ఒక కుమార్తె హన్షితా రెడ్డి. ప్రస్తుతం కొన్ని సినిమాల నిర్మాణ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. సమంత ‘శాకుంతలం’ సినిమా ప్రొడక్షన్ పనులు చూసుకున్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే దిల్‌రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రెండు భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి విజయ్‌-వంశీపైడిపల్లి కాంబోలో రానున్న ‘వారసుడు’. మరొకటి రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం.

Related posts