బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్ఫుల్గా వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మరో ఐదు రోజులలో ఈ కార్యక్రమానికి ఎండ్ కార్డ్ పడనుంది. 17 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ జర్నీలో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో ఒకరు విజేతగా నిలవనున్నారు. ఆ విజేత ఎవరనే దానిపై ప్రస్తుతం హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే గతవారం శివజ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేషన్ ప్రక్రియలు ఉండవు. అయితే విజేతగా నిలిచేది శ్రీముఖినే అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే శ్రీముఖి టీం కూడా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి అధికారిక ఖాతాల నుంచే ‘ఓట్ ఫర్ శ్రీముఖి’ అంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ‘రాములమ్మ కాంటెస్ట్’ను కూడా ప్రవేశపెట్టారు. శ్రీముఖిని బుల్లితెర రాములమ్మ అని అంటారని అందరికీ తెలిసిందే. అంతేకాదు ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలోని పాట వచ్చినప్పుడు శ్రీముఖి ఒక సిగ్నేచర్ స్టెప్ కూడా వేస్తుంటుంది. ఇప్పుడు అదే స్టెప్పుతో ‘రాములమ్మ కాంటెస్ట్’ను నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్లో భాగంగా ఆసక్తిగల అమ్మాయిలు, అబ్బాయిలు రాములమ్మ సిగ్నేచర్ స్టెప్తో ఒక వీడియో చేసి #THISTIMEWOMAN #VOTEFORSREEMUKHI హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇలా పోస్ట్ చేసిన వీడియోల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి.. ఆ వీడియో చేసినవారికి శ్రీముఖితో డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తారు. ఆ సిగ్నేచర్ స్టెప్ ఎలా చేయాలో తెలియజేయడానికి శ్రీముఖి కొంత మంది పిల్లలతో కలిసి చేసిన వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. మరి అందరూ అనుకుంటున్నట్టుగానే శ్రీముఖినే విన్నర్ అవుతుందేమో చూడాలి.
next post