telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పుష్ప : అల్లు అర్జున్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు

Pushpa

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. లాక్‌డౌన్ సమయంలో విడుదల చేసిన అల్లు అర్జున్ ఫస్ట్‌ లుక్ సినిమాపై అంచనాలను రెండింతలు చేసింది. ‘పుష్ప’ను పాన్-ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు సుకుమార్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘పుష్ప’ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. పోలాండ్‌కు చెందిన సినిమాటోగ్రాఫర్ మిరోస్తావ్ క్యూబా బ్రోజెక్ ఈ సినిమాకు కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించనున్నారని, ఎర్రచందనం దుంగలను తరలించే లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. కరోనా, లాక్‌డౌన్ రాకపోయి ఉంటే ఈ పాటికి ఈ మూవీ షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కి వచ్చేది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. ఈ మూవీ షూటింగ్ పది శాతం కూడా పూర్తి కాలేదు. ఇక నిదానంగా అన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్తున్న నేపథ్యంలో పుష్ప షూటింగ్‌ని ఈ నెలలో ప్రారంభించేందుకు సుకుమార్ ప్లాన్ చేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ఏజెన్సీలో సెట్టింగ్స్‌ని వేశారు. కాగా ఈ సినిమాలో విలన్‌గా మొదట కోలీవుడ్ నటుడు విజయ్‌ సేతుపతిని సుకుమార్ ఖరారు చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సేతుపతి ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కూడా ధ్రువీకరించారు. ఆ తరువాత ఈ పాత్ర కోసం పలువురిని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విలన్‌గా ఇప్పుడు బాలీవుడ్‌ నటుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట సుకుమార్. ఇందుకు సంబంధించి ఓ నటుడితో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆ నటుడి పేరు బయటకు రాకపోగా.. అతడికి స్క్రిప్ట్‌ బాగా నచ్చిందని సమాచారం. ఒకవేళ అతడు ఓకే చెప్తే ఈ నెల నుంచి మొదలు కానున్న పుష్ప షూటింగ్‌లో జాయిన్ అవ్వబోతున్నట్లు టాక్. మరి పుష్పకు విలన్‌గా ఎవరు ఖరారు కానున్నారు అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Related posts