మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే…తాజాగా బులియన్ మార్కెట్లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా స్థిరంగా ఉండిపోయింది. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్లోనూ బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 47,000 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,000 పలుకుతోంది. బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం భారీగానే తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ. 700 తగ్గి రూ. 75,700 వద్ద కొనసాగుతోంది.
previous post