నేడు శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. శ్రీకాకుళంలో మూడో విడద ‘అమ్మఒడి’ నిథులు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
శ్రీకాకుళం వేదిక గా సీఎం జగన్ ఒకటి తరగతి నుంచి ఇంటర్ దాకా చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,594.6 కోట్లు నేరుగా కంప్యూటర్ బటన్ నొక్కి అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ 11 గంటలకు కోడిరామ్మూర్తి మైదానానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. తొలుత అమ్మ ఒడి పథకం లబ్ధి దారులతో మాట్లాడతారు. అనంతరం 11.25 గంటల నుంచి 12.10 గంటలకు బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నారాయణ