రాజకీయాల్లో తన చివరి కోరిక గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మణుగూరు బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీతారామ ప్రాజెక్ట్తో మన కల నెరవేరనుందన్నారు. జాతీయ రహదారులతో గోదావరి పరివాహక ప్రాంతంలో రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్ట్ లు, జాతీయ రహదారులు మిషన్, భగీరథ మిషన్ కాకతీయతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాటలో ఉందన్నారు. కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో యావత్ దేశం ఆ పాలన కోసం ఎదురు చూస్తున్నారని కొనియాడారు.
next post
సాహసకృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవు: ప్రణబ్ ముఖర్జీ