మహమ్మారి కరోనా ప్రభావంతో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న ‘వి’ సినిమా వాయిదా పడింది. ఈ సందర్భంగా నిర్మాతలు అఫీషియల్ ట్వీట్ చేశారు. ప్రజా శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ‘వి’ మూవీని వాయిదా వేస్తున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్. మార్చి 25న ఉగాది శుభాకాంక్షలతో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ, కోవిడ్ 19 కారణంగా మూవీని ఏప్రిల్కి వాయిదా వేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీకు తప్పక వినోదం అందిస్తుందని మేము హామీ ఇస్తున్నాం అని చిత్ర బృందం పేర్కొంది.