telugu navyamedia
సినిమా వార్తలు

‘థ్యాంక్‌ యూ’ నుంచి ..’ఏంటో ఏంటేంటో’ మెలోడీ సాంగ్ రిలీజ్‌

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్‌ యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విభిన్న ప్రేమకథగా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రాశీఖన్నా, మళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అవిక గోర్‌ ఓ కీ రోల్‌ పోషిస్తోంది.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుద‌లై టీజర్‌, పోస్టర్స్ ప్రేక్ష‌కుల‌కు విశేషంగా ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జులై 8న చిత్రం థియేటర్లలో విడుదలకానుంది.

ఈ క్ర‌మంలో ఈ సినిమా నుంచి ‘ఏంటో ఏంటో’ అనే మెలడీ లిరికల్ సాంగ్ విడుదలైంది. సాంగ్‌ లవర్​బాయ్​ లుక్స్​తో చైతు మరోసారి ఆకట్టుకుంటున్నారు . ఆనంత్‌ శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా.. జొనితా గాంధీ ఆలపించారు. తమన్‌ స్వరాలను సమకూర్చారు.

పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related posts