telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసు : నలుగురు స్టార్ హీరోయిన్లకు ఎన్సీబీ నోటీసులు

Drugs

హీరో సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేసే క్రమంలో బాలీవుడ్‌ డ్రగ్స్ లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. డ్రగ్స్‌ లింకులతో సంబంధమున్న 25 మంది పేర్లను రియా వెల్లడించడంతో తీవ్ర కలకలం రేగింది. తాజాగా దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ప్రశ్నించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు నోటీసులు అందాయి. డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం మూడు రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్సీబీ ఆ నలుగురికి నోటీసుల్లో పేర్కొంది.

Related posts