telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ ను కలవరపెడుతున్న కరోనా.. మరో ఎమ్మెల్యేకు పాజిటివ్

క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఈని చర్యలు తీసుకున్న పరిస్థితి మారడం లేదు. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే.. అధికారి అయినా స‌రే దానికి మాత్రం ఏ మాత్రం వివ‌క్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనాబారిన ప‌డ్డారు.. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను కూడా ట‌చ్ చేసింది క‌రోనా.. తాజాగా.. మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు ఈ మధ్యలో కాంటాక్ట్ అయినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని..త్వరగానే కోలుకుంటానని పేర్కొన్నారు.

Related posts