telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : క్వాలిఫైర్ 2 కి వెళ్లిన హైదరాబాద్…

ఈ రోజు ఐపీఎల్ 2020 లో ఎలిమినేటర్ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే బెంగళూరు జట్టులో ఆరోన్ ఫించ్(32), ఎబి డివిలియర్స్ (56) రాణించడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. ఇక 132 పరుగ్గుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన హైదరాబాద్ మొదట తడబడింది. 12 ఓవర్లలో కేవలం 67 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత కేన్ విలియమ్సన్(50) జాసన్ హోల్డర్ (24) తో ఆకట్టుకోవడంతో మరో రెండు బంతులు ఉండగానే హైదరాబాద్ విజయం సాధించి క్వాలిఫైర్ 2 కి వెళ్ళింది. ఫైనల్స్ కి వెళ్లాలంటే క్వాలిఫైర్ 2 లో ఢిల్లీ పై విజయం సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన కోహ్లీ సేన ఇంటికి తిరిగి రావాల్సిందే. అర్ధశతకం చేసి జట్టు విజయంలో కీలక పాత్రా పోషించిన విలియమ్సన్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Related posts