telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ భవిష్యత్‌కు వైసీపీ హానికరం : వచ్చే ఎన్నికల్లో ఎవరి వైపో మీరే తేల్చుకోండి

*ఏపీ భవిష్యత్‌కు వైసీపీ హానికరం

*రాష్ట్ర భవిష్యత్తు లో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యం

*రాష్ట్రానికి కాపాడేది జనసేన మాత్రమే..

2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని జనసేన అధినేతప పవన్ కల్యాణ్ అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మండపేటలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల‌ కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన తర్వాత బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు లో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమ‌ని ..వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు వుంటారో తేల్చుకోవాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని తమ పార్టీ స్వాగతించిందని  పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును దురుద్దేశపూర్వకంగా పెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ చేసిన హత్య కేసును తప్పు దారి పట్టించేందుకు ఆ వివాదం తెచ్చారన్నారు.

జగన్‌లాగా అంబేద్కర్ పాదయాత్ర చేయలేదని.. అయినా ఆయన మహానీయుడు అయ్యారన్నారు. తెలంగాణలో నా అనే భావన ఉంటే.. ఏపీ అంటే కులం అనే భావన ఉందని.. కులాన్ని గౌరవిస్తూనే కులాతీతభావన ఉండాలన్నారు.

ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులను పంచాయతీ అభివృద్దికే కేటాయిస్తామని స్పష్టం చేశారు.

తమకే అధికారం ఇవ్వాలని కోరడం లేదని.. ఈ ప్రభుత్వం కావాలా.. మరో ప్రభుత్వం రావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. అధికారం కోసం నడిచి వచ్చే వారిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై నడిచేవారంతా మహానుభావులు కాదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీ చైతన్యం ఎక్కువ అని.. మార్పు ఇక్కడ నుంచే ప్రారంభం కావాలన్నారు.

జాతీయ రాజకీయనేతలకు కులాలు అంటగట్టకూడదని మండపేటలో తీర్మానం చేసుకుందామన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ముద్దుల మామయ్యను మళ్లీ ఆదరిస్తారా? అని పవన్ ప్రశ్నించారు. పాదయాత్ర కుర్చీ కోసమే చేశారని, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి కాదని పవన్ అన్నారు.

ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు హెలికాప్టర్ లోనే ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు. ఈ ప్రభుత్వమే కావాలా? జనసేన కావాలా? అన్నది మీరే తేల్చుకోవాలని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు జేబుల్లోంచి డబ్బులు తీసి ఇవ్వడం జనసేకు సరదా కాదని, ప్రజల సమస్యలను పది మందికి తెలిసేలా గళం విప్పుతున్నామని చెప్పారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విధంగానే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు రూ. ఏడు లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వంలో లేకపోియనా కౌలు రైతులకు సాయం చేస్తున్నామన్నారు. వాళ్ల జేబుల్లోనుంచి డబ్బులు తీసి ఇవ్వమనడం లేదని ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఇవ్వమని అడుగుతున్నామన్నారు.

తనకు జగన్‌ లాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోయినా.. కోట్ల రూపాయలురైతుల కుటుంబాలకు సాయం చేశామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా వారంతా రైతులు కాదని అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అమ్మ, అక్క అంటూ మాట్లాడారని.. ఇప్పుడు నిండు గర్భిణి అంగన్వాడి కేంద్రం వద్ద క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

తప్పు జరిగినప్పుడు ఎదిరించే శక్తి లేకపోతే మనుగడ ఉండదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులను ఎత్తి చూపే విషయంలో యువత వెనుకడుగు వేయవద్దని సూచించారు. కేసులకు భయపడవద్దని..జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. 99 తప్పుల వరకూ చూస్తామని.. వందో తప్పునకు తాట తీస్తామని హెచ్చరించారు.

ఏపీ భవిష్యత్‌కు వైసీపీ హానికరమన్నారు. పోలీసులు నిష్ఫక్ష పాతంగా పని చేయాలన్నారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారు.. ఎంత మందిని జైల్లో పెడతారని ప్రశ్నించారు. పాలకుల కోసం పని చేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనిపోలీసులకు హితవు పలికారు. రాష్ట్రానికి కాపాడేది జనసేన మాత్రమేనన్నారు. వైసీపీ లేని రాష్ట్రాన్ని చూడబోతున్నామన్నారు.

 

Related posts