telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇప్పుడు హైదరాబాద్ సేఫ్ అంటున్న రకుల్

rakul

ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు తగ్గింది. అందుకు కారణం ‘మన్మథుడు 2’ ఫ్లాప్ అవడమేనని టాలీవుడ్ టాక్. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. దీంతో కోలీవుడ్, బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. అయితే లాక్ డౌన్ పీరియడ్‌లో రకుల్ ప్రీత్ వార్తల్లో నిలిచినంతగా మరే హీరోయిన్ లేదు. ఇక ఈ బ్యూటీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ లో ఢిల్లీలో ఉంటుంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో, దీనికి తోడు కాలుష్యం కూడా పెరుగుతుండడంతో అక్కడ ఉండేందుకు భయపడుతోంది. తాజాగా రకుల్ తన సోదరుడితో కలిసి హైదరాబాద్ కు వచ్చేసింది. హైదరాబాద్ లో రకుల్ కు సొంత ఇల్లు ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం తన సోదరునితో కలిసి ఇక్కడే నివసించేందుకు ఆమె నిర్ణయించుకున్నది. ప్రస్తుతం ఢిల్లీ కంటే హైదరాబాద్ లో నివసించడం సేఫ్ అని రకుల్ పేర్కొంటుంది. హైదరాబాద్ లో ఉంటే తనకు ఉన్న ఎఫ్ 45 జిమ్ వ్యవహారాలను కూడా చూసుకోవడానికి వీలు ఉంటుందని ఆమె అంటోంది.

Related posts