telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతి : .. రహదారిపై .. దేవినేని ఉమ నిరసనలు..

uma protest for ap capital

ఏపీకి ఒకే రాజధాని ఉండాలని, అదీ అమరావతే కావాలని డిమాండ్‌ చేస్తూ కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద జాతీయ రహదారిపై తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, కంచికచర్ల మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికపై కృష్ణా, గుంటూరు జిల్లాలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Related posts