telugu navyamedia
క్రైమ్ వార్తలు

అంబేద్కర్‌ జిల్లా రావులపాలెంలో కాల్పుల కలకలం.. వ్యాపారిపై తుపాకీ, నాటు బాంబులతో దాడి.

కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల సత్యనారాయణరెడ్డిపై ఇద్దరు దుండగులు తుపాకీతో దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆదిత్య రెడ్డి వారిని ప్రతిఘటించారు.

దీంతో దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపారు. గన్ మిస్ ఫైర్ కావడంతో.. వ్యాపారి కుటుంబం ఎదురుతిరిగింది.

ఈ క్రమంలో బాధిత కుటుంబమంతా కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వాళ్లు రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఆ క్రమంలో వారి వద్ద నుంచి ఓ సంచి పడిపోయింది. దానిని పరిశీలించగా అందులో 2 నాటు బాంబులు, ఓ జామర్ ఉన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.బాధిత కుటుంబం నుంచి పలు వివరాలను సేకరించారు.సుపారీ నేపథ్యంలో దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

 

Related posts