భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు జట్టులో స్థానం ఇస్తున్నా పదే పదే విఫలం కావడం విమర్శలు దారితీస్తోంది. ఇప్పటికే పలువురు మాజీలు రిషబ్ పంత్ ఆటతీరును మార్చుకోమని సలహా ఇస్తుండగా, మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు. రిషబ్ పంత్కు వరుసగా అవకాశాలు ఇస్తుండటంతో టీమిండియా మేనేజ్మెంట్ను నేరుగానే ప్రశ్నించాడు. పంత్కు ఇచ్చిన అవకాశాలు చాలని, సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవాలన్నాడు. రిషబ్ పంత్కు మద్ధతుగా నిలిచాడు మాజీ హిట్టర్ యువరాజ్ సింగ్. పంత్పై విమర్శలు చేస్తున్నారు. ఇకనైనా కట్టిపెట్టాలంటూ బదులిచ్చాడు. పంత్పై వరుసగా వ్యాఖ్యలు చేయడం ఆపండి.
ధోనితో పోల్చుతూ, అతనికి ప్రత్యామ్నాయం అంటూ పంత్పై ఒత్తిడి తెస్తున్నారు. ధోని కూడా ఒక్కరోజులోనే అవకాశాలు ఒడిసి పట్టుకోలేదు. ధోని స్థానాన్ని భర్తీ చేయాలంటూ పంత్కు సమయం పడుతుంది. రిషబ్ పంత్ ఆటతీరుపై కాస్త ఓపిక పట్టండి. రిషబ్ పంత్లో మ్యాచ్లను గెలిపించే సత్తా ఉంది. అతనిలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కోచ్కానీ, కెప్టెన్ కానీ పంత్కు మెంటార్గా వ్యవహరిస్తే గాడిలో పడతాడు. అనవసరంగా పంత్పై కామెంట్లు చేయడం ఆపండని యువరాజ్ సూచించాడు.