టీమిండియా క్రికెటర్ల ఫొటోలను మహిళల రూపంలోకి మార్చి మాజీ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సోమవారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు హర్భజన్.. గతంలో భారత్కు ఆడిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్తో పాటు తన ఫొటోను కూడా జెండర్ స్వాప్ యాప్ ద్వారా మార్చి ఆ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు.. వీళ్లలో ఎవరితో డేట్కు వెళతారు అని ఆ ఫొటో కింద ఓ ప్రశ్న కూడా సంధించాడు. దీనికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందిస్తూ.. మధ్యలో కళ్లజోడు పెట్టుకున్న అమ్మాయి (గంగూలీ ఫొటోనే)తో అని సరదాగా సమాధానమిచ్చాడు. ఇప్పుడీ పోస్ట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
previous post