telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇదేం రాజకీయం.. వైసీపీపై సోమిరెడ్డి ఫైర్

somireddy brother into ycp today

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు సహా అసెంబ్లీకి వస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మార్షల్స్ అడ్డుకుని గేటుకు తాళం వేసిన ఘటనపై ఆయన అధికార పార్టీపై మండిపడ్డారు.

గతంలో చంద్రబాబు ఇంటి గేటుకే తాళం వేసి నిర్బంధించారని, ఇప్పుడు అసెంబ్లీలోకే రానివ్వకుండా అడ్డుకున్నారని, ఇదేం రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అధికార పార్టీ దారుణమైన రాజకీయం నడుపుతోందన్నారు. అసెంబ్లీ వద్ద చీఫ్ మార్షల్ నుంచి గ్రామాల్లో కాని స్టేబుల్ వరకు అందరి తీరు ఒకేలా ఉందన్నారు. దీన్నిబట్టే ప్రభుత్వ పాలన ఎలా వుందో అర్థమవుతోందని విమర్శించారు.

Related posts