telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు వల్లే రాజధాని లేకుండా పోయింది: ఎమ్మెల్యే రోజా

roja ycp mla

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. అరాచకాలను సృష్టించి, రాజకీయపరంగా అనుకూలంగా మలచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని రోజా ఆరోపించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలను విడదీసే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు.

ఎమ్మల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి టీడీపీ కుట్రే అన్నారు. రైతులను చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. మూడు రాజధానులకు ఓకే అన్న గంటా శ్రీనివాస్‌రావుపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతులు దాడి ఎందుకు చేస్తారని రోజా ప్రశ్నించారు. రైతుల ముసుగులో టీడీపీ నాయకులే పిన్నెల్లిపై దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

Related posts