telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోటీ ప్రపంచంలో ‘ఇంగ్లీషు’ చాలా ముఖ్యం: ఎమ్మెల్యే రోజా

roja ycp mla

పోటీ ప్రపంచంలో ‘ఇంగ్లీషు’ చాలా ముఖ్యమని ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా అన్నారు. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా చిత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లీషు మీడియం చదువులను వ్యతిరేకిస్తున్న నేతలంతా తమ పిల్లలను మాత్రం ఇదే మాధ్యమంలో చదివిస్తున్నారని విమర్శించారు.

టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా వుందని మండిపడ్డారు. ఎందుకంటే, టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చు గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలా అని దుయ్యబట్టారు. ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించే పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు లాంటి వాళ్లు ‘తెలుగు’ను ఉద్ధరిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.

Related posts