telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోజా

roja ycp mla

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేస్తోంది. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి నిత్యావసర వస్తువులు అందించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరిలో ఎమ్మెల్యే రోజా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రోడ్లపైకి వచ్చి పేదలకు అవగాహన కల్పిస్తూ మరీ ఆమె సేవలు అందించారు. నిత్యావసరాల కోసం సామాజిక దూరం పాటించకుండా రోడ్లపై వస్తోన్న వారికి ఆమె పలు సూచనలు చేశారు. క్యూలో నిలబడాలని దూరంగా ఉండాలని చెప్పారు. పోలీసులతో కలిసి అవగాహన కల్పించారు. అనంతరం స్వయంగా కూరగాయలు తూకం వేసి కొందరికి అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె చేసిన పోస్టులు చూస్తోన్న నెటిజన్లు చాలా గ్రేట్‌ మేడం అని కామెంట్లు చేస్తున్నారు.

Related posts