telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటీ బయటకు: మంత్రి సుచరిత

ap minister sucharita on fluds

టీడీపీ నేతల పై ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందని, టీడీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయని విమర్శించారు. ఆ పార్టీ నేతలు నేతలు వాళ్ల పార్టీని కాపాడుకోవడానికి వైసీపీపై, తమ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

మందడంలో మహిళలు స్నానం చేస్తుంటే డ్రోన్ల ద్వారా చిత్రీకరించారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారంతో లబ్ధి పొందాలని టీడీపీ నేతలు చూడటం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. రాజధాని రైతులు శాంతియుతంగా ఉద్యమిస్తే ఎటువంటి అభ్యంతరం లేదు కానీ, ఈ ఉద్యమాల్లో బయట వ్యక్తులు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజధాని తరలింపు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమేనని ఆమె పేర్కొన్నారు.

Related posts