telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

లోకేష్ ఓటమి కోసం వై ఎస్ ఆర్ సీపీ మాస్టర్ ప్లాన్ ?

Minister Lokesh comments YS Jagan
మంగళగిరి అసెంబ్లీ స్థానం లో ఎవరు గెలుస్తారు ? 
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దృష్టి  అంతా  ఇప్పుడు మంగళగిరి పైనే వుంది గుంటూరు జిల్లాలో వున్న 17 నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి ఇది రాజధాని అమరావతి పరిధిలో వుంది . ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు తన కుమారుడు  లోకేష్ ను  మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్నారు . అయితే గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం లో విజయం సాధించిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఇప్పుడు లోకేష్ తో పోటీపడుతున్నారు .
జనసేన తరుపున పవన్ కళ్యాణ్ చల్లపల్లి శ్రీనివాస్ ను నిలబెట్టాడు , నిజానికి ఈ నియోజక వర్గం నుంచి వామపక్ష అభ్యర్థిని నిలబెడతామని  చెప్పిన  పవన్ చివరి నిముషంలో మాట తప్పి శ్రీనివాస్ ను తెర పైకి తీసుకు వచ్చారు .అయినా అతన్ని గురించి పట్టించుకొనేవారు లేరు . పోటీ లోకేష్ , రామకృష్ణ రెడ్డి మధ్యనే . ఇటు తెలుగుదేశం అటు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . రామకృష్ణ రెడ్డి స్థానికుడు , ఇప్పటికే రాజన్న క్యాంటిన్ ద్వారా 4 రూపాయలకు భోజనం , 10 రూపాయలకు కూరగాయలు అందిస్తున్నాడు . మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు . 
YCP MLA RK comments Minister Lokesh
స్థానికుణ్ణి కాకపోయినా రాజధాని పరిధిలో వున్న మంగళగిరి నియోజక వర్గానికి మరింత అభివృద్ధి చేస్తానని లోకేష్ హామీ ఇస్తున్నాడు . ఈ నియోజక వర్గంలో రెండు లక్షల 68 వేలమంది ఓటర్లు వున్నారు . ఎక్కుమనేది నేత పనివారు వున్నారు . అయితే వీరిని ఎవరు ఎక్కువ ప్రభావితం చేస్తారో తెలియడం లేదు . వీరి కోసం రామకృష్ణ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశాడని అంటున్నారు . లోకేష్ , రామకృష్ణ రెడ్డి ఇద్దరిలో ఓటర్లు ఎటువైపు వున్నారు అనేది ఇంకా స్పష్టం కావడం లేదు . అయితే పోటీ మాత్రం నువ్వా ? నేనా ? అన్నట్టు సాగుతుంది . చంద్ర బాబు తెలుగు దేశం నాయకులతో లోకేష్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని చెబుతున్నట్టు తెలుస్తుంది . 
 
అయితే  లోకేష్ విజయం నల్లేరు మీద నడక మాత్రం కాదు . రామకృష్ణా రెడ్డి గెలుపై ధీమాగానే వున్నాడు . ఎందుకంటే ఇంతకు ముందు తాను ప్రజలకు చేసిన పనులే గెలిపిస్తాయని అతను నమ్ముతున్నాడు . చంద్ర బాబు అమలు చేసిన పధకాలు ప్రజలకు చేరిపోయాయని , పసుపు కుంకుమ , కళ్యాణ లక్ష్మి , డ్వాక్రా మహిళలకు రుణాలు , పెన్షన్ లు , నిరుద్యోగ భృతి , రైతు రుణ మాఫీ లాంటివి తమను గెలిపిస్తాయని తెలుగు దేశం నాయకులు నమ్ముతున్నారు . లోకేష్ తరుపున నారా బ్రాహ్మణి కూడా ప్రచారం చేస్తుంది . రామకృష్ణ రెడ్డి ని గెలిపించాలని లక్ష్మి పార్వతి ప్రచారం చేసింది. ఇక్కడ మనీ , మందు ఊహించని విధంగా ప్రజలకు చేరిపోతుంది  లోకేష్ , రామకృష్ణా రెడ్డి, ఈ ఇద్దరిలో ఆ పానకాల స్వామి ఆశీస్సులు ఎవరిపై ఉన్నాయో మరి ?
-భగీరథ 

Related posts