telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు వేలెత్తి చూపడానికే ప్రాధాన్యం: జగన్ విమర్శలు

విపక్ష నేత చంద్రబాబు వేలెత్తి చూపడానికే ప్రాధాన్యం ఇస్తారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏదైనా మంచి పని జరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఏ చిన్న పొరబాటు జరిగినా అవినీతి జరిగిందని అసత్య ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు.

అందుకోసమే గ్రామసచివాలయాల పక్కన ఏర్పాటు చేసే ఎరువులు, పురుగుమందులు, విత్తన దుకాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులకు ఆదేశిస్తున్నామని జగన్ తెలిపారు. నాణ్యతకు ప్రభుత్వమే హామీ ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts