telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లేనిది ఉన్నట్టు సృష్టించడం టీడీపీ నైజం: మంత్రి బుగ్గన

Mla buggana,data leake

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ‘రైతు భరోసా’ పథకంపై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షం తప్పుబట్టేందుకు చూస్తోందని విమర్శించారు. లేనిది ఉన్నట్టు సృష్టించడం టీడీపీ నైజమని మండిపడ్డారు.

టీడీపీ చేసిన పాపానికి రైతులకు ఇవ్వాల్సిన రుణం కన్నా ఒక్క పైసా కూడా ఎక్కువగా బ్యాంకులు ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కూడా డిస్కమ్ ల డబ్బులు వాడారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చంద్రబాబు మార్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ కుప్పకూలిందని అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ డబ్బును దారి మళ్లించారని ఆరోపించారు.

Related posts