telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఐదు నెలల్లో జగన్ చేశారు: మంత్రి అవంతి

avanthi srinivas minister ap

ఐదేళ్ల టీడీపీ హయాంలో జరగని అభివృద్ధిని ఐదు నెలల్లో సీఎం జగన్ చేశారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు వచ్చేస్తున్నాయన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావడంతో అమరావతిలో ఆయనను పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts