telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వచ్చే నెల 10 నుంచి “వైయస్సార్ కంటివెలుగు”

eye testing kantivelugu

ఏపీ ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించేందుకు మరో మరో పథకాన్ని ప్రారంభించనుంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి ‘వైయస్సార్ కంటివెలుగు’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద అందరికీ ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. అవసరమైనవారికి కళ్లజోళ్లను ఉచితంగా అందించనున్నారు.

తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది కంటి పరీక్షలు చేయించుకొని, ఉచితంగా కళ్ళజోళ్లను పొందుతున్నారు. 

Related posts