ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన అస్సెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బిజిబిజిగా గడుపుతునారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ఎల్పీ సమావేశం ఈనెల 7న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరగనుంది.
ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ నెల 8న మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ చర్చలు జరపనున్నారు. మంత్రుల ఎంపికపై ఎమ్మెల్యేలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.