telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పై వైఎస్ వివేకా హత్య కొత్త మలుపు.. దుమారం లేపుతున్న లేఖ!

YS Vivekananda Reddy's letter accusing Prasad

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వైఎస్ వివేకానంద రాసినట్లు చెబుతున్న ఓ లేఖ తీవ్రమైన దుమారం రేపుతోంది. కారు డ్రైవర్ ప్రసాద్ తనను చచ్చిపోయేట్లు కొట్టాడని వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఆయన బంధువులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు అందించారు.

పులివెందులకు చెందిన ప్రసాద్‌ ఒకటిన్నర నెలగా వైఎస్ వివేకా వద్ద కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11.30కు ఇంటి వద్ద వదలిన ప్రసాద్‌ తిరిగి ఎప్పుడొచ్చాడనేది తెలియదు. నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటరు రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవరు ప్రసాద్‌ను వదలి పెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి అని ఆ లేఖలో ఉంది. ఈ లెటరు అందుకున్న పోలీసులు కారు డ్రైవరు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఈ లేఖపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ స్పందించారు. గొడ్డలితో నరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న వ్యక్తి ఎలా ఈ లేఖ రాయగలుగుతారని ప్రశ్నించారు. కారు డ్రైవరు ప్రసాద్‌ను, రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు ఆర్‌.సుధాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts