telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్‌ వివేకా అంత్యక్రియలు పూర్తి

YS Vivekananda funeral Completed

హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుల మధ్య ఆయన పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. పులింవెందుల లోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో శనివారం ఉదయం 11 గంటల ప్రాంత్రంలో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

జగన్, విజయమ్మ, కుటుంబసభ్యులందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అభిమాన నేతలను కడసారి వీక్షించేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.అంతకముందు జరిగిన అంతిమ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిల, అవినాష్ రెడ్డితో సహా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు బంధువులు పాల్గొన్నారు.

Related posts