telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలు: విజయసాయిరెడ్డి 

YS Vivekananda Reddy's letter accusing Prasad
వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలున్నాయని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. వివేకా మరణ సమాచారం తెలుసుకున్న ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో వాస్తవాలు బయటికొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన పెదనాన్న మృతిపై అనుమానాలు కలుగుతున్నాయని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. 
ఎవరో దాడి చేస్తే చనిపోయినట్లు ఉందని, తలకు ముందువెనుక గాయాలున్నాయని, చేతులకు గాట్లు ఉన్నాయని అవినాష్ రెడ్డి చెప్పారు.వివేకానందరెడ్డి మృతిపై దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక వివేకానందరెడ్డి పీఏ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. డాగ్‌స్వ్కాడ్‌ను రంగంలోకి దింపారు. కాసేపట్లో ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం జరగనుందని ఎస్పీ చెప్పారు.

Related posts