telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సు విచారించిన సీబీఐ

ys vivekananda reddy

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చేపట్టారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న గెస్ట్ హౌస్ నుంచి సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు వివేకా కుమార్తె సునీతను అధికారులు విచారించారు. మూడు గంటల పాటు ఆమె విచారణ కొనసాగింది. విచారణకు తన వద్ద ఉన్న ఆధారాలు, వివిధ డాక్యుమెంట్లను ఆమె తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని, సీబీఐ చేత కేసును విచారించాలంటూ సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, పిటిషన్ లో ఆమె పేర్కొన్న వివరాలను సీబీఐ అధికారులు తెలుసుకున్నారు.

Related posts