telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్​ వివేకా హత్య కేసు సీబీఐకి: ఏపీ హైకోర్టు

ap high court

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ హత్య జరిగి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం చాలా కీలకం కనుక ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.

2019 లో వైఎస్ వివేకా హత్య జరిగింది. ఈ కేసును ఛేదించేందుకు మూడుసార్లు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా, ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో నిందితులను ఇంతవరకూ తేల్చలేదు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత గతంలో పిటిషన్లు దాఖలు చేశారు.

Related posts