మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా కడప ఎస్పీ రాహుల్ ప్రకటించారు. వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు నిర్ధారించారు. తలపై, చేతిపై రెండు చోట్ల గాయాలున్నట్టుగా గుర్తించామన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం సీఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్ పర్యవేక్షణలో మొత్తం 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయవాడ నుంచి 3 ప్రత్యేక బృందాలను సంఘటన స్థలానికి పంపించారు.
ఈ బృందాలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ అమిత్ గార్గ్ కు అప్పగించినట్టు డీజీపీ తెలిపారు. హత్యోదంతంలో క్లూస్ టీమ్ ఆయన గదిలో కొన్ని వేలిముద్రలు సేకరించినట్టు కడప ఎస్పీ రాహుల్ తెలిపారు. తాము సంఘటన స్థలాన్ని పరిశీలించిన సమయంలో ఇంటి వెనుక తలుపు తెరిచే ఉందని అన్నారు. వెనుక తలుపు నుంచి ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
ముస్లింలపై విరుచుకుపడటం తగదు..మోదీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు