మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొమ్మా పరమేశ్వర్రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరమేశ్వర్ రెడ్డిని మంగళవారం పోలీసులు పులివెందుల సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు పులివెందుల సివిల్ జడ్జి కోర్టు జడ్జి జడ్జి నార్కో అనాలసిస్ తదితర పరీక్షలకు సమ్మతమేనా అని పరమేశ్వర్రెడ్డిని జడ్జి ప్రశ్నించారు. అందుకు పరమేశ్వర్రెడ్డి తనకు గుండెజబ్బు ఉందని ఇలాంటి పరీక్షలు చేస్తే ఇబ్బందేమోనని వివరించారు.
దీంతో జడ్జి అవన్నీ డాక్టర్లు చూసుకుంటారని చెప్పి నార్కో అనాలసిస్ తదితర పరీక్షలకు అనుతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వివేకా హత్య కేసులో నాలుగో వ్యక్తిని పోలీసులు నార్కో అనాలసిస్ పరీక్షలకు తరలించనున్నారు. ఇప్పటికే వాచ్మాన్ రంగయ్య, ఎర్రగంగిరెడ్డి, శేఖర్రెడ్డిలను నార్కో అనాలసిస్ పరీక్షలకు గుజరాత్కు తరలించారు. ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డిని కూడా నార్కో అనాలసిస్ పరీక్షల కోసం అక్కడికి తరలించనున్నారు.