మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనకు కుటుంబసభ్యులు ఈ రోజు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం జగన్తో పాటు విజయమ్మ, భారతి, షర్మిల, అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్‘ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ… ’33 ఏళ్లు ఆయనతో కలిసి జీవించిన సమయంలో నేను ఆయనలో చూసిన మంచితనం, ఆయన చెప్పిన మాటల ఆధారంగా ఈ పుస్తకం రాశాను. ఆయనలో మూర్తీభవించిన మానవత్వం గురించి, ఆయన మాటకు ఇచ్చే విలువ గురించి రాయాలనిపించిందని తెలిపారు. ఎంతో మంది జీవితాలకు ఆయన వెలుగునిచ్చారుని చెప్పారు.ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారని ఆమె తెలిపారు.