telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ వేకానంద భార్య

YS Viveka daughter sunitha complent EC

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన భార్య సౌభాగ్యమ్మ సోమవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌభాగ్మమ్య సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. ఈ హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆమె ఆ పిటిషన్‌లో కోరారు.

మూడు రోజుల క్రితం న్యూఢిల్లీలో ఈ కేసు విషయమై సీఈసీని వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కలిశారు. సీఈసీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గోబాను కలిశారు. సిట్ దర్యాప్తుపై సునీతారెడ్డి ఆరోపణలు చేశారు. ఏపీ పోలీసులతో సంబంధం లేని థర్డ్‌పార్టీ ఎంక్వైరీని కోరుతున్నారు. దీంతో సౌభాగ్యమ్మ సోమవారం హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.

Related posts