telugu navyamedia
తెలంగాణ వార్తలు

స్పీక‌ర్ గారు ..తన మీద కాదు.. ముందు నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోండి

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్విటర్​ వేదికగా స్పందించారు.

స్పీక‌ర్ గారు తనపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంలూ నన్ను కించపరచి, నన్ను, నాతోటి మహిళలను అవమానపర్చిన సంస్కార హీనుడైన మంత్రి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ మాట్లాడని ప్రసంగాన్ని షేర్ చేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువతకు తోడుగా ప్రతి మంగళవారం తాను చేస్తున్న నిరుద్యోగ దీక్షను.. వ్రతాలంటూ కించపరిచిన మంత్రి కేటీఆర్​పై సైతం చర్యలు తీసుకోవాలని ఆమె స్పీకర్​కు విజ్ఞప్తి చేశారు.

నిన్న వైఎస్ షర్మిలపై వైఎస్ షర్మిలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తమపై వైఎస్ షర్మిల నిరాధారణ ఆరోపణలు చేస్తూ తమ గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరుస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. తనకు ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదు అందిందని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Related posts