telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఆ డబ్బంతా చంద్రబాబు ఏం చేశారు: షర్మిల

ys sharmila press meet
అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు చెబుతోందని, ఆ డబ్బంతా సీఎం చంద్రబాబు ఏం చేశారని వైసీపీ మహిళానేత వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం  తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో  నిర్వహించిన బహిరంగ  సభలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతిలో ఒక్క పర్మినెంట్ భవనం భవనం కూడా నిర్మించలేదన్నారు అలాంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఎలా ఇస్తారని పేర్కొన్నారు.
 అక్రమాలకు, వెన్నుపోటుకు చంద్రబాబు మారు పేరని షర్మిల ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆమె విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారన్నారు. రైతులకు ప్రతి మే నెలలో లో రూ.12,500 ఇవ్వడంతో పాటు పెన్షన్ పెంచుతారని చెప్పారు. పిల్లలను బడికి పంపిన తల్లికి ఏడాదికి రూ.15,000 అందిస్తారని షర్మిల తెలిపారు.

Related posts