telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లోకేష్ ఓ పప్పు.. అ ఆలు రావు: వైఎస్ షర్మిల

ys sharmila press meet

ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థినారా లోకేష్ పై వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకేష్ ఓ పప్పు అంటూ ఎద్దేవా చేశారు. పప్పుగారికి కనీసం జయంతికి, వర్థంతికి తేడా కూడా తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని కానీ జాబు వచ్చింది కేవలం చంద్రబాబు  కొడుకు లోకేష్‌కు మాత్రమేనని తేల్చి చెప్పారు. ఓనమాలు రాని వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారంటూ ధ్వజమెత్తారు. అ ఆలు రావు గానీ అగ్ర తాంబూలం తనకే కావాలన్నాడట అన్న చందంగా పప్పు తీరు కూడా అలాగే ఉందన్నారు. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రబాబు మంత్రి ఉద్యోగం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

Related posts