telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీకాకుళంలో సీఎం పర్యటన : కృపారాణికి ఘోర అవ‌మానం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అయిన కిల్లి కృపారాణికి ఘోర పరాభవం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప‌ర్య‌టిస్తున్నారు.

ఈ క్రమంలోనే  ప‌లువురు మంత్రులు, వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు హెలిప్యాడ్ వ‌ద్ద సీఎం జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికారు. అయితే సీఎం హెలీప్యాడ్ వ‌ద్ద‌కు వెళ్లాలని చూసిన కిల్లీ కృపారాణిని.. అధికారులు అనుమతించలేదు.దీంతో అధికారుల  తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  నిరాశ‌గా అక్కడి నుంచి వెనుదిరిగారు.

killi kruparani express intolerance over ysrcp leaders as not getting protocol proference in CM jagan tour in srikakulam

దీంతో దీంతో అక్కడున్న వైసీపీ నాయకులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్రమంత్రిగా పనిచేసిన తాను ఎవరో జిల్లా కలెక్టర్, అధికారులకు తెలియదా అంటూ నిల‌దీశారు. తాను ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతుంటే తనకు తగిన విలువ ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

చివరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ స్వయంగా కృపారాణి కారు దగ్గరకు వెళ్లి బతిమిలాడినా ..నాకు జరిగిన అవమానం ఇక చాలు అంటూ కిల్లి కృపారాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 

Related posts