telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి సాధిస్తాం: కేసీఆర్

cm jagan and KCr

హైదరాబాద్ ప్రతిగభవన్‌లో ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సీఎంలు కేసీఆర్, జగన్ చర్చించారు . గోదావరి, కృష్ణా నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సీఎంలు నిర్ణయానికి వచ్చారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి సాధిస్తామని అన్నారు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేమన్నారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధాల్లో గుణాత్మక మార్పు వస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Related posts