ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు ఆయన సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
previous post