వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. సోమవారం కర్నూల్ జిల్లా ఆదోనిలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడ తాము అనేక కార్యక్రమాలను చేపడుతామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగులకు, ఫుట్పాత్ వ్యాపారస్తులకు ఈ సందర్భంగా హామీలు గుప్పించారు.
పోలీస్ శాఖలో కిందిస్థాయి ఉద్యోగులకు మెరుగైన జీతాలతో పాటు.. వారానికో సెలవు ఇస్తామని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారులకు రూ. 10 వేలను వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. గిట్టుబాటు ధర లేక రైతాంగం ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు.
చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరు: మంత్రి అనిల్